17 April, 2026 | 11:58 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం కోట గుళ్లు

21-05-2025 12:07 AM

ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 20 (విజయ క్రాంతి):కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయం అద్భుత శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం, కోట గుళ్ళను సందర్శించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కి ఘన స్వాగతం పలికారు.

మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో శిల్పాలను, గోపురాలను సందర్శించారు.  కోటేశ్వరాలయం, నంది మండపం, నాట్య మండపాల్లో శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఏసీబీ డైరెక్టర్ వెంట చిట్యాల, భూపాలపల్లి సిఐలు మల్లేష్, నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.