17 April, 2026 | 11:58 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

కిషన్‌రెడ్డీ.. చిల్లర రాజకీయాలు వద్దు

21-05-2025 12:07 AM
  1. దేశభక్తి అనేది కాంగ్రెస్ కల్చర్‌లోనే ఉంది 
  2. రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకో 
  3. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి మాట్లా డారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన గాంధీ కుటుంబంపై కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సరికాదని హిత వుపలికారు.

దేశభక్తి అనేది కాంగ్రెస్ కల్చర్‌లోనే ఉందనే విష యం తెలుసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశానికి జరిగిన నష్టంమెంతో చెప్పాలని రాహుల్‌గాంధీ అడిగితే దేశ వ్యతిరేకి అవుతారా? అని మండిపడ్డారు. దేశం కోసం గాంధీ కుటుంబమే ప్రా ణత్యాగం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టంచేశారు.

రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే ఆలోచన కిషన్‌రెడ్డి చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌లో పా ల్గొన్న సైనికులపై చిల్లర కామెంట్స్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు. కిషన్‌రెడ్డికి చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి అదనంగా నిధులు తీసుకురావాలని హితవుపలికారు.