21-05-2025 12:08:37 AM
వరంగల్, మే 20 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పట్టుబడ్డ సుమారు నాలుగు కోట్ల 28 లక్షల విలువైన 856.50 కిలోల ఎండు గంజాయిని నగర శివారులోని కాకతీయ మెడికల్ సర్వీస్ లో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.