07-06-2025 02:01:02 AM
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి
కల్లూరు,జూన్ 6(విజయ క్రాంతి) నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలో పుల్లయ్య బంజర ఉత్తర బాగం, తూర్పు బాగం, రామ నగరం కలిపి 7వ వార్డ్ గా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.పురపాలక సంఘం పరిధి 7వ వార్డ్ (పుల్లయ్య బంజర్ ) లో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్.
కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదవాని సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ దేశానికే ఆదర్శగా నిలుస్తుంది, ఎమ్మెల్యే తెలిపారు.ఇందరమ్మ ఇళ్ల పధకం అనేది నిరంతర ప్రకీయ ప్రతి పధకం అర్హులైన ప్రతి పేదవాని గడపకి చేరుతుంది అని తెలిపారు.
బడి ఈడు పిల్లల్ని ప్రభుత్వంపాఠశాల లో చేర్పించాలని, ప్ర భుత్వం పాఠశాల లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారు పిల్లల మంచి భవిష్యత్తుకు పు నాది గా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పాఠశాలలలో పిల్లల్ని చదివించాలని తెలిపా రు.ఈ కార్యక్రమం లో కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, తహసీల్దార్ పు లి సాంబ శివుడు, ఎంపీడీఓ చంద్ర శేఖర్,హౌసింగ్ ఆఫీసర్ సాయి పవన్, ఏనుగు సత్యం బాబు, ఆళ్లకుంట నరసింహారావు,శివ కుమార్ నాయక్,భైర్ల కాంతారావు,ప్రభుత్వ అధికారులు,7వ వార్డ్ ఇందిరమ్మ కమిటీ, కల్లూరు మండలం,కల్లూరు పట్టణం, 7వ వార్డ్ (పుల్లయ్య బంజార్) కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.