07-06-2025 02:01:33 AM
గజ్వేల్, జూన్ 6 : వంద రోజుల కార్యక్రమాలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి గజ్వేల్ మున్సిపాలిటీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డును తీసుకోవడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలితజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ గారు, కార్యాలయ అధికారులు, మెడికల్ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది.