11-08-2025 12:16:21 AM
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 31వ డివిజన్ పరిధిలోని బాలసముద్రంలో రూ. 35 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 60వ డివిజన్ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ ఫేస్-2 లో రూ. 35 లక్షలతోసీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నుంచి పార్టీలకు అతీతంగా డివిజనల్ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, గత ప్రభుత్వ హయాంలో జరగని ఎన్నో సుదీర్ఘ పనులను సుగుమతరం చేసి ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. అనంతరం వడ్డేపల్లి చెరువు కట్టామీద ఎంతో వైభవీతంగా జరుగుతున్న కట్ట మైసమ్మ ఉత్సవ వేడుకకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో 60 వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు ఏనుకంటి పున్నం చందర్, కాంగ్రెస్ నాయకులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి రవీందర్, జనగాం శ్రీనివాస్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్ కుమార్, ఎండి సాజిద్, మట్టపల్లి కమల్, మిడిదొడ్డి శేఖర్, పిట్ట వంశీ, బిజెపి శ్రేణులు రోకుల సతీష్, మట్టపల్లి రామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.