calender_icon.png 17 June, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోపాల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ శంకుస్థాపన

17-06-2025 01:35:12 AM

పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి 

నిజామాబాద్ జూన్ 16: (విజయక్రాంతి):  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండల కేంద్రంలో  సోమవారం రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి ,డి జి ఎం సాహు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ మోపాల్ మండలానికి నాకు ఎంతో అనుబంధం ఉందని, గతంలో తెలంగాణ ఉద్యమంలో మోపాల్ గ్రామంలో ఉద్యమం చేశానని అన్నారు. ఎన్నికల సమయంలో మోపాల్ మండలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియను ఏర్పాటు చేయాలని ఆరోజే చెప్పానని అన్నారు.

మోపాల్ మండలం ఏర్పాటు చేయడానికి నా కృషి ఎంత ఉందని మోపాల్ గ్రామస్తులకు తెలుసు అని అన్నారు. ఇక్కడ ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. నాకు ఈ ప్రాంతం అంటే నాకు ఎంతో అభిమానం అని అన్నారు. ఎస్బిఐ బ్యాంకు అంటే ఆర్.బి.ఐ బ్యాంకు గుండెకాయ లాంటిదని అన్నారు. 30 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ట్రైనింగ్ సెంటర్ కావాలని అడుగుతున్నారు భవిష్యత్తులో చేసుకుందామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎస్బిఐ బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని  నిర్మించుకోవడం జరుగుతుంది అన్నారు. 120 సంవత్సరాలు అనుభవం గల ఈ బ్యాంకు మన ప్రాంతంలో బ్రాంచ్ ని స్థాపించడం వల్ల , మోపాల్ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ కల్పిస్తుందని, ఇక్కడి ప్రాంత వాసులకు నాలుగ స్థాయి  ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎస్బిఐ బ్యాంకు అధికారులకు ఎమ్మెల్యే కోరారు.

మంచిప్ప ఎస్బిఐ బ్రాంచ్ ను అక్కడి నుంచి తరలిస్తామని అనగా ఆ బ్యాంకు భవనం కోసం ఎమ్మెల్యే కోటా నుండి  నిధులు   మంజూరు చేసినాను అన్నారు.  కార్పొరేట్ సంస్థల కొన్ని సి ఎస్ ఆర్ ఫండ్ ను కేటాయించి, గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించి ఆ గ్రామ అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. ఎస్బిఐ అడ్మినిస్ట్రేటివ్ భవనంతో పాటు, మండల రెవిన్యూ ఆఫీసు, పోలీస్ స్టేషన్, మండల ఎంపీడీవో ఆఫీస్, మండల  ఎడ్యుకేషన్ ఆఫీస్ వంటి భవనాలు అన్ని ఒకే సముదాయంలో ఉండాలని ఇక్కడనే సిగ్నేచర్ ఇలాంటి భవనాన్ని నిర్మిస్తున్నావని అన్నారు.

అలాగే మంచిప్ప ప్రాజెక్ట్ కు సంబంధించి పాత డిజైన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమర్తించిందని, వారం రోజులలో ప్రకటిస్తుందని అన్నారు. అంతకు ముందు ఎస్బిఐ డీజీఎం సాహు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ భవనానికి స్థలం కావాలని అడగగానే నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అనుకూలంగా స్పందించి, నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో  ఎస్బిఐ వారు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, బ్యాంకు బ్రాంచ్ ని స్థాపించడం నాకు ఎంతో సంతోషమని ప్రభుత్వం నుంచి పెను వెంటనే అనుమతులు తీసుకువచ్చారని అన్నారు.

మోపాల్ మండల ప్రజలకు, నాయకులకు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ రీజినల్ మేనేజర్, బ్యాంకు మేనేజర్, ఆర్డీవో  రాజేంద్ర కుమార్, మండల తహసిల్దార్  రామేశ్వర్, కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలికేట్  శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, పిఎసిసి చైర్మన్లు, గోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్,సతీష్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు మోపాల్ మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.