23-06-2025 08:48:06 PM
మేడ్చల్ అర్బన్: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే నెరవేరుతుందని మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్(Former councillor Kaude Mahesh) అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపికైన లబ్ధిదారుల యొక్క ఇంటి నిర్మాణాలకు మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ. ఐదు లక్షలు అందించి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారని తెలిపారు.