23-06-2025 08:45:49 PM
మునగాల: జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్(District Collector Tejas Nandalal) ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ లో అంతర్జాతీయ మాదకద్రవ్యల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బరాఖత్ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీఐ రామకృష్ణా రెడ్డి(CI Ramakrishna Reddy) అవగాహన కల్పిస్తూ, ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటె కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వీరారెడ్డి, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఎస్సై ప్రవీణ్ కుమార్, ఎస్ఓ సుధారాణి, అంగన్వాడి సూపర్వైజర్ బెజవాడ సరిత, విలేజ్ కార్యదర్శి స్కూల్ టీచర్లు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.