23-06-2025 08:50:52 PM
మూసాపేట: మూసాపేట మండల(Moosapet Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు కార్యక్రమం ముసాపేట పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమమును ఉద్దేశించి మూసాపేట ఎస్సై ములకలపల్లి వేణు(SI Mulakalapalli Venu) మాట్లాడుతూ... యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని అందమైన జీవితాన్ని గడపాలని యువత విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దనీ మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
ప్రధానంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. పాఠశాల నందు యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాజునాయక్ మండల ఎంపీడీవో కృష్ణయ్య మండల ఎంఈఓ రాజేశ్వర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.