19-06-2025 12:48:21 AM
వలిగొండ,జూన్18(విజయక్రాంతి): ఇంది రమ్మ ఇండ్ల శంకుస్థాపనలతో పేదల కళ్ళలో ఆనందం వెలు విరుస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి అన్నారు బుధవారం మండలంలోని వెలువర్తి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల నిర్మాణానికి భూమి పూజలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల ను అందిస్తుందని అదేవిధంగా రేషన్ కార్డులను, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్ 10 లక్షలకి ఆరోగ్య శ్రీ బీమా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం పెంపు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలువర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉక్కుర్తి స్వామి కాసుల వెంకటేశం కొండూరు సాయి కార్యదర్శి నరేందర్ మల్లేశం సైదులు సంజీవ కావ్య పాండు నాగయ్య వీరయ్య తదితరులు పాల్గొన్నారు.