19-01-2026 06:50:00 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని దర్యాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు పనులకు ఎంపీడీఓ సురేష్ సోమవారం గ్రామ సర్పంచ్ రాపెల్లి రాజయ్యతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో మేరుగైన రోడ్లు నిర్మించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, ఉప సర్పంచ్ కలవేన సమ్మక్క చేరాలు, వార్డు సభ్యులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.