3 July, 2026 | 5:25 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

దొంగతనం కేసులో నలుగురి అరెస్టు

20-03-2026 01:22 AM

సీఐ నిరంజన్ రెడ్డి 

కరీంనగర్ క్రైం, మార్చి19(విజయక్రాంతి): నగునూరు గ్రామంలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్ లోని ఒక స్టోర్ రూమ్ లో ఉన్న కరెంటు కు సంబంధించిన సుమారు 60 వేల రూపాయల విలువగల కరెంటు వైర్ బండల్స్ ను దొంగిలించారు.

యజమాని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దొంగిలించుకుని పారిపోయిన వ్యక్తుల గురించి వెతుకుచుండగ గురువారం తీగలగుట్టపల్లి నుండి ఆరేపల్లికి పోవు దారిలో ఎల్లమ్మ గుడి దగ్గరలో నలుగురు వ్యక్తులు కనబడగా వారు పోలీసు లను చూసి పారిపోవుటకు ప్రయత్నం చేయగా వారిని పట్టుకొని విచారించగా నగునూరులో జరిగిన దొంగతనం గురించి ఒప్పుకున్నారు.

నేరం చేసిన నేరస్తులైన  బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజీ మరియు సూర నవీన్ లను అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై అరెస్టు మెమో జారీ చేశారు.