19-05-2025 01:09:44 AM
విజయనగరంలో ఘోర విషాదం
విజయనగరం, మే 18: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం కంటోన్మెం ట్ పరిధిలో గల ద్వారపూడి గ్రా మంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారులు విగతజీవులై కనిపించారు. ఆడుకునేందుకు కారులోకి ఎక్కి.. డోర్ లాక్ పడటంతో ఊ పిరాడక మరణించినట్టు తెలుస్తోం ది. ఉదయ్ (8), చారుమతి (8), చరి ష్మా (6), మనస్వి లుగా గుర్తించారు.