calender_icon.png 6 June, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది మంది సజీవదహనం

19-05-2025 01:11:44 AM

సోలాపూర్ జిల్లాలోని టెక్స్‌టైల్ మిల్లులో ఘోర అగ్నిప్రమాదం

ముంబై, మే 18: సోలాపూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది సజీవద హనం అయ్యారు. ఎంఐడీసీలోని అక్కల్‌కోట్ రోడ్డులో ఉన్న సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో ఆదివారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారితో పాటు మొ త్తం ఎనిమిది మంది ప్రాణాలు కో ల్పోయారు. మంటల్లో మిల్లు యజమాని హాజీ ఉస్మాన్ హసన్‌భాయ్ మన్సూరీ కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల కు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం ప్రకటించారు.