30-01-2026 02:03:10 AM
ఆరుగురికి తీవ్ర గాయాలు
ములుగు/మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతరలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెంద గా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర ప్రాంగణంలో అస్వస్థతకు గురైన భక్తులను ప్రధాన మెడికల్ క్యాంపునకు తరలించే క్రమంలో నలుగురు మృతి చెందిన ట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జగన్నగూ డెం గ్రామానికి చెందిన సిద్ధగోని శంకర్గౌడ్ (50) జనవరి 28న రాత్రి 8.40 గంటలకు మృతి చెందారు.
మద్యం అతిగా సేవించడం తో హైదరాబాద్ అల్వాల్కు చెందిన పల్లెపు రాజు (40), పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గ్రామానికి చెందిన రవీందర్ సింగ్ టాగో ర్ (41) మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా ఐందారం గ్రామా నికి చెందిన రేవల్లి సుగుణ (60) గురువా రం జంపన్న వాగు నుంచి కుటుంబ సభ్యులతో వస్తుండగా.. చెత్త సేకరించే ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో సుగుణ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.