10 March, 2026 | 6:14 PM

కామారెడ్డిలో 4 గ్రామాలు ఏకగ్రీవం

30-11-2025 12:00 AM

అందరూ బలపరిచిన అభ్యర్థులే

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ లంలో 4 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచరెడ్డి మండలం వెనుక తండాలో సర్పంచుగా కేలోతు పద్మ స్వామి, ఎల్లంపేట సర్పంచుగా మారుపాక అంజ మ్మ, లక్ష్మీరాజ్యం, అంకిరెడ్డిపల్లి తండాలో బానోతు శ్రీరామ్, బోడగుట్ట తండాలో మాలోత్ సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.