17 April, 2026 | 11:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మహిళల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

10-10-2025 12:00 AM

ప్రారంభించిన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా మహిళల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించి, ప్రారంభ దశలోనే గుర్తించే లక్ష్యంతో మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా డా. ఎల్. జయంతిరెడ్డి, గైనకాలజిస్టు, ఓజీహెచ్‌ఎస్ అధ్యక్షురాలు హాజరయ్యారు.

గౌరవ అతిథిగా డా. సబిత గోడసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికవర్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. ఉచిత స్క్రీనింగ్ కూపన్ల కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లు అక్టోబర్ 31 వరకు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, హైటెక్ సిటీలో అందుబాటులో ఉంటాయి.

మహిళలు తమ ఆరోగ్య పరీక్షలను ప్రాధాన్యతగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. స్క్రీనింగ్‌లో భాగంగా క్యాన్సర్ నిపుణుల కన్సల్టేషన్, మామోగ్రామ్ (బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్), పాప్ స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష) మరియు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.