10 April, 2026 | 7:25 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం

28-07-2025 12:00 AM

దోమకొండ, జూలై 27 ః కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్దిపేట  కృష్ణ సాయి ఐ హాస్పిటల్, సెంటర్ ఫర్ సైట్ ఆధ్వర్యంలో బిబిపేట గ్రామానికి చెందిన డాక్టర్  బచ్చు కృష్ణమూర్తి, డాక్టర్  పెద్ది శ్రీపతి  ఆధ్వర్యంలో 185 మంది కంటి పరీక్షలు జరిపి 54 మంది కి శస్త్ర చికిత్స లు అవసరమని తెలిపారు.

శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితముగా సిద్దిపేట లో  కృష్ణ సాయి హాస్పిటల్ లో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు హరీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్, అంతర్జాతీయ కోఆర్డినేటర్ భాశెట్టి నాగేశ్వర్, నిలబైరయ్య, గాంధారి సిద్ధరాములు,

పెద్ది నాగేశ్వర్, హరి ప్రసాద్, శ్రీనివాస్, బచ్చు కృష్ణమూర్తి , డాక్టర్ శ్రీపతి  లను శాలువాతో సన్మానించారు. ఉచిత కంటి చికిత్స శిబిరంలో 185 మందికి పరీక్షలు జరిపి 54 మంది శస్త్ర చికిత్సలకు  అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణుడు గడిల విజయకుమార్, కిరణ్ కుమార్, మురికి శ్రీనివాస్ పాల్గొన్నారు.