15 March, 2026 | 11:11 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఉచిత పార్కింగ్ కొనసాగించాలి

05-11-2024 02:38 AM

నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద ప్రయాణికుల ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి):  నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులు, యువజన సంఘాల నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు.  నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ర్ట అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, డీవైఎఫ్‌ఐ రాష్ర్ట కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ..

ప్రభుత్వ స్థలంలో ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా పార్కింగ్ పేరుతో ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ డబ్బులు దండుకోవడం సరికాదన్నారు. ఉచిత పార్కింగ్‌ను కొనసాగిం చాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ నిబంధనలు తుంగలో తొక్కు తున్నారని విమర్శించారు.

మెట్రోలో ప్రయాణానికి వందల రూపాయలు చెల్లిస్తూ మళ్లీ పార్కింగ్‌కి కూడా ఖర్చుచేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ఎల్‌అండ్‌టీ యాజమాన్యం పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రయాణికులెవరూ డబ్బులు చెల్లించడం లేదని తెలిపారు. పెయిడ్ పార్కింగ్‌పై పునరాలోచించాలని కోరారు.