23-06-2025 08:36:56 PM
హనుమకొండ (విజయక్రాంతి): షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయ కేంద్రం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Union Public Service Commission), సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(Civil Service Aptitude Test) 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు 33 జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ అర్హులైన నిరుద్యోగులు, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం ౩ లక్షలు ఉంచకుండా ఉండాలి. http://tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే 07.07.2025 వరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు 13.07.2025 రోజున ఎంపిక పరీక్షా నిర్వహించడం జరుగుతుంది.
ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్దులకు ప్రవేశం కల్పించి, యస్సీ స్టడీ సర్కిల్ బంజార హిల్స్, హైదరాబాద్ లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావునా అర్హులైన అభ్యర్దులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరి(District Collector Sneha Shabarish) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వై.వి.గణేష్, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, నారాయణ, డి.ఆర్.డి.ఓ మీనా శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి బి.నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ యస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖా సంచాలకులు డాక్టర్.కె.జగన్ మోహన్, కనకన్న తదితరులు పాల్గొన్నారు.