12-02-2026 02:43:22 AM
ఆసిఫాబాద్లో ఓటేసిన కూతురు
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన తండ్రికి మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి లండన్ నుంచి ఓ యువతి స్వదేశానికి చేరుకున్నది. ఆరవ వార్డులో బీఆర్ఎస్ తరఫున చిలువేరు వెంక న్న బరిలో ఉన్నారు. ఆయన కూతురు చిలువేరు శ్రేయ లండన్లో ఎంఎస్ పూర్తి చేశారు. నెల రోజుల ముందుగానే విమాన టికెట్ బుక్ చేసుకుని, తండ్రి కోసం వచ్చి ఓటేసింది.