14-05-2025 01:07:16 AM
పెబ్బేరు ఎప్రిల్ 13: మండల పరిధిలోని యాపర్ల గ్రామంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాగంగా ప్రైవేట్ పాఠ శాలల్లో 7,8వ తరగతి చదువుతున్న మంది వి ద్యార్థులు యాపర్ల ఉన్నత పాఠశాలలో చేరారు.
విధ్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మైనోద్దీన్, శ్రీధర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు స్వరాజ్యం బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.