23-06-2025 12:09:06 AM
ఈ అకడమిక్ ఇయర్ లో మొత్తం 643 అడ్మిషన్లు
గత ఏడాది కంటే 143 మంది ఎక్కువ
మరింత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్న ఎంఈవో
చేవెళ్ల, జూన్ 22: ప్రభుత్వం చేపట్టిన ‘బడి బాట’ చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలో మంచి ఫలితాలు ఇస్తోంది. బడీడు, డ్రాప్ అవుట్ పిల్లలతో పాటు ప్రైవేటు స్కూ ళ్ల నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టి ఈ కార్యక్రమంలో మొత్తం 643 కొత్త అడ్మిషన్లు రా గా... ఇందులో 189 ప్రైవేటు స్కూళ్ల నుంచి రావడం విశేషం. ఒక్క దామరిగిద్ద గ్రామంలోనే 11 మంది పిల్లలు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూల్ లో చేరారు.
ఓవరల్ అడ్మిషన్లలో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 143 మంది ఎక్కువగా జాయిన్ అయ్యారు. ప్ర స్తుతం చేవెళ్ల మున్సిపాలిటీ, మండలంలో మొత్తం 71 స్కూళ్లు (ఎంపీపీఎస్, హైస్కూ ల్స్, ఒక కేజీబీవీ, ఒక మోడల్ స్కూల్) ఉం డగా.. 314 మంది రెగ్యులర్ టీచర్లు ఉన్నా రు. కొత్తగా జాయిన్ అయిన వారితో కలిపి విద్యార్థుల సంఖ్య 4,032(ఒకటో తరగతి నుంచి 10 తరగతి)కు చేరింది. స్టూడెంట్లకు ఇప్పటికే టెకట్స్, నోట్ బుక్స్ తో పాటు ఒక జత యూనిఫాం ఇచ్చేశారు.
ఎంఈవో ప్రత్యేక చొరవ
కొత్త అడ్మిషన్లు పెరగడం, విద్యార్థులు ప్రై వేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరడం లో ఎంఈవో పురందాస్ ప్రత్యేక చొరవ తీ సుకున్నారు. ప్రతి గ్రామంలో స్థానిక టీచర్ల తో కలిసి ఇంటింటికి తిరిగి ‘మీ పిల్లలకు మా బడిలో చేర్పించండి.. చదువకపోతే నా ది బాధ్యత’ అని తల్లిదండ్రులను కోరుతున్నా రు. వెంచర్లు, ఫ్యాక్టరీలలో పనిచేసే కా ర్మికుల పిల్లలను చేర్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మూడు రోజుల కింద టీచర్లతో కలిసి దామరిగిద్దలో శివారులోని ఆర్గా నో సంస్థ నిర్మిస్తున్న విల్లాల ప్రాంతానికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న కార్మికుల పిల్లలను బడి లో చేర్పించాని కోరారు. ఈ మేరకు కార్మికులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు యాజ మాన్యాలతో మాట్లాడారు. అంతేకాదు మూ త పడ్డ స్కూళ్లను గుర్తించి.. అవకాశం ఉన్న చోట రీ ఓపెన్ చేయిస్తున్నారు.
నారాయణ దాస్ గూడ ప్రైమరీ స్కూల్ ను పునరుద్ధరించి 14 మంది స్టూడెంట్లను జాయిన్ చేయడంతో పాటు ఇద్దరు టీచర్లను అపాయింట్ చేశారు. అలాగే ఇబ్రహీంపల్లి స్కూ ల్ను రీ ఓపెన్ చేసి.. 14 మంది స్టూడెంట్లను, జాలగూడ స్కూల్ ను పునరుద్ధరింఇ నలుగురిని జాయిన్ చేశారు. ఈ రెండు స్కూళ్లకు ఒకరి చొప్పున టీచర్ ను అలాట్ చేశారు.
అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే ఫండ్ తో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. దామరిగిద్దలో ఎకోసాన్స్ ఫౌండేషన్ , కన్వేజ్జీనియస్ సంస్థల సహకారంతో తరగతి గదుల డిజిటలీకరణ తో పాటు విద్యార్థుల మూత్రశాలలు, మరుగుదొడ్లు ఆధునీకరిస్తున్నారు. కుమ్మెర గ్రా మంలో బెంగళూరుకు చెందిన ఎన్ సీ ఆర్ అట్లీయోస్ సంస్థ సహకారంతో క్లాస్ రూ మ్స్, టాయిలెట్స్, ఆధునీకరణతో పాటు మిడ్ డే కిచెన్ ఏర్పాటు చేయించారు.
ఆందోళన కలిగిస్తున్న సింగిల్ డిజిట్ స్కూళ్లు
కొన్ని స్కూళ్లలో ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడం, మరికొన్నింటిలో కేవలం సింగి ల్ డిజిట్ సంఖ్యకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఆలూరులో మొత్తం ఏడు స్కూళ్లు(ఎంపీపీఎస్ 3(బాయ్స్, గరల్స్ హరిజన వాడ), జడ్పీ హెచ్ ఎస్ 2, ఎంపీపీఎస్(యుఎం)1, జడ్పీహెచ్(యుఎం)1) ఉన్నాయి.
ఇందులో ఎంపీపీఎస్ గరల్స్ , జడ్పీహెచ్ ఎస్ (ఉర్దూ మీడియం) లో గత మూడేళ్లుగా ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడంతో ఈ స్కూళ్లను మెర్జ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం జడ్పీహెచ్ ఎస్ (బాయ్స్) లో 99 మంది విద్యార్థులు, గర ల్స్ స్కూల్ లో 38, ఎంపీపీఎస్ హరిజనవాడలో 45 మంది విద్యార్థులు ఉండగా.. ఎం పీపీఎస్(యుఎం)లో 7, ఎంపీపీఎస్ (బాయ్స్)లో 9 మంది మాత్రమే ఉన్నారు.
వీటి తో పాటు హస్తేపూర్ ఎంపీపీఎస్ లో 6, కౌ కుంట్ల ఎంపీపీఎస్(యూ) 2, గొల్లగూడ లో 7, జాజుగుట్టలో 7, నాంచేరులో 13, దేవరం పల్లిలో 7, చేవెళ్ల ఎంపీపీఎస్ (యూ)లో 10, పల్గుట్టలో 9, మల్లారెడ్డి గూడలో 2, వెంకన్నగూడ లో15, మల్కాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 15 మంది స్టూడెంట్లు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా మోడల్ స్కూల్లో 453, చేవెళ్ల జడ్పీహెచ్ ఎస్ 270, చేవెళ్ల ఎంసీపీఎస్ (గరల్స్)లో 227, కేజీబీవీలో 227, ప్రభుత్వ హై స్కూల్ చేవెళ్లలో 197 మంది విద్యార్థులు ఉన్నారు.
పిల్లల చదువుకు నాది బాధ్యత
చేవెళ్ల మున్సిపల్, మండల పరిధిలోని అ న్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తున్నం. ప్రస్తుతం 314 మంది టీచర్లు ఉన్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన మెరిట్, హాజరు శాతాన్ని నమోదు చేస్తు న్నం.
వారి ప్రతిభ ఆధారంగా వివిధ కోర్సులకు గైడెన్స్ కూడా ఇస్తున్నం. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించం డి. వారికి చదువు రాకపోతే నేను బాధ్యత తీసుకుంట.
పురందాస్, చేవెళ్ల ఎంఈవో
నా ముగ్గురు పిల్లలను చేర్చిన
నాకు ముగ్గురు పిల్లలు. ఫస్ట్, సెకం డ్, థర్డ్ క్లాసు చదువుతున్నరు. ఇది వరకు చేవెళ్లలోని ఓ ప్రైవేట్ స్కూ ల్కు పంపేవాన్ని. మా ఊరు సర్కారు స్కూళ్లో టీచర్లు బాగా చదువు చెబుతున్నరు. దీంతో నా పిల్లలను వెంటనే ఎంఈవో సార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్ లో చేర్పిచ్చిన.
చాకలి శంకర్, దామరిగిద్ద