calender_icon.png 23 June, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపికలో అధికారుల జాప్యం ఎందుకు?

23-06-2025 12:11:20 AM

- దళారులకే ‘డబుల్’ ఇండ్లా.. అసలైన లబ్ధిదారులకు మొండిచేయా...?

- రోజుకో మలుపు తిరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంచాయితీ 

గంభీరావుపేట, 22 జూన్ (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో గంభీరావుపేట మండల కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

మిగిలిన 33 ఇండ్ల పంపిణీలో అధి కారులు రహస్యంగా లబ్దిదారులను ఎంపిక చేయడం ఎందుకని, అసలైన లబ్దిదారులను వదిలి, దళారులు చేతికే మళ్ళీ ఇండ్లను పరిమితం చేస్తారా అనే అనుమానం గత నాలు గు రోజులగా జరుగుతున్న తతంగం చూస్తే వస్తుందని అనుకుంటున్నారు.

గత ప్రభుత్వ హయంలో బీసి లకై 160 ఇండ్లను నిర్మించగా అందులో 122 ఇండ్లను ఎన్నికల సమ యంలో మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీ దుగా హడావిడిగా డబుల్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, అందులో అంతులేని అవినీతి జరిగిందని అర్జీదారులు అప్పట్లో 5 నెలలు రెవెన్యూ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన ప్రయోజ నం లేకుండా పోయింది. దళారుల చేతివాటంతో అసలైన లబ్దిదారులను వదిలి తమకు నచ్చిన వారికి, అనర్హులకు లబ్ది చేకూర్చారంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

మిగిలిన ఇండ్ల పంపిణీ జరిగే ప్రక్రియలో ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో, డబుల్ ఇండ్లు రాని కొంత మంది ఖాళీగా ఉన్న 38 ఇండ్లను అక్రమించారు. అనర్హులకు ఇండ్లు ఇచ్చి, అర్హులను విస్మరించారని పేదలు నిరంతరం ధర్నాలు, రాస్తా రోకోలు, చివరకు తహసీల్దార్ కార్యాలయం కూడా ముట్టడి చేయడంతో, అధికారులు ఏమి చేయలేని స్థితిలో మిన్నకుండి పోయా రు.

కాగా చేసేది ఏమి లేక మిగిలిన ఇండ్లనైనా అసలైన నిరుపేదలకు అందించాలని, అర్జీదారులు చేస్తున్న అందోళనలతో విసుగు చెందిన అప్పటి తహసీల్దార్ లగిశెట్టి భూపతి నిరుపేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో, తహసీల్దార్ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించగా, అనర్హులకు ఇచ్చిన ఇండ్లను సైతం ఖాళీ చేయించాలని అక్రమణ దారులు భీష్మించి కూర్చున్నారు.

కొం త మంది మద్య వర్తుల సహాయంతో అసలైన లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని, అక్రమణ చేసిన వారు ఖాళీ చేస్తేనే ఇండ్లు ఇవ్వడానికి విలవుతుందని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఒకరిద్దరు తప్ప, అక్రమణదారు లు అందరూ తాము ఉంటున్న ఇండ్లను స్వ చ్చందంగా ఖాళీ చేయాగా, వాటిని రెవెన్యూ అధికారులు తాళం వేసి స్వాధీన పరుచుకున్నారు.

కాగా అప్పటికీ కూడా పంపిణీ చేయడం కుదరకపోవడంతో అప్పటి నుండి నేటి వరకూ అవి అలానే ఉండగా, ఈనెల 19వ తేది గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో ఎవ్వరికీ తెలువకుండా, కలె క్టర్ లబ్దిదారుల లిస్టు పంపారని, అందులో అర్హులను గుర్తించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, గోప్యంగా ఎంపిడివో అధ్వర్యంలో కొంత మంది కార్యదర్శులు ఎంపిక ప్రక్రియని చేస్తున్నారని, ఇండ్లు ఉన్నవారి వద్దకే వచ్చి వారి జాబితా చూపిస్తూ, వారి ఫొటోలు సైతం తీసుకుంటున్నారని డబుల్ అర్జీదారులు, అక్రమణలో ఉన్నవా రు అయోమయానికి గురవుతున్నారు.

అధికారులు సైతం గోప్యం వహిస్తూ లబ్దిదా రులను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం ఎమిటని, మళ్ళీ ఎవ్వరు దళారులుగా మారుతున్నారనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదని అర్జీదారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచా యతీ కార్యాలయం వద్ద ప్రజలందరి మం దు గ్రామ సభలొ లబ్దిదారుల ఎంపిక చేయాలని లేనిచో ధార్నాలు, రాస్తారోకోలు చేసి డబుల్ ఇండ్లను సాధించుకుంటామని అధికారులను హెచ్చరించిన పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

జి ల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యా యం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికై అసలైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందా లేకా మళ్ళీ ఇంతకు ముందులాగే ఇండ్ల పంపిణీ జరుగుతుందా వేచి చూడాల్సిన పరిస్థితినెలకొంది.