తీన్మార్ మల్లన్నకు పూర్తి మద్దతు

05-05-2024 01:57:04 AM

పీఆర్టీయూ తెలంగాణ వెల్లడి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): వరంగల్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉపఎన్నిక అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటిఉమాకర్‌రెడ్డి, డాక్టర్ పర్వతి సత్యనారాయణ శనివా రం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలకుల తప్పిదాల ను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తున్న తీన్మార్ మల్లన్న ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.