10-06-2025 01:38:05 AM
* ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం అప్పటి ప్రభుత్వం హైపవర్ కమిటీకి ఇచ్చింది. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం. బరాజ్ల్లో నీళ్లు నింపమని ఎవరూ ఆదేశించలేదు. 16లక్ష ల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పింది. దాని సూచన మేరకే బరాజ్లు, రిజర్వాయర్లు పెంచాం.
మాజీమంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్ర జల సంఘం(సెంట్రల్ వాటర్ కమిషన్-సీడబ్ల్యూసీ), రిటైర్ట్ ఇంజినీర్ల సూచ నల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాజీమంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నీటి లభ్యత లేనం దునే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చామని వివరించారు.
నీళ్లు అమ్మి ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణా లు చెల్లించాలనుకున్నట్టు వెల్లడించారు. మేడిగడ్డ నిర్మాణం ఏ ఒక్కరి నిర్ణయం కాద ని, నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేకసార్లు భేటీ అయ్యారని తెలిపా రు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్రావు హాజరు కాగా ఓపెన్ కోర్టు లో జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు 44 నిమిషాల పాటు జరిగిన విచారణలో మొత్తం 20 ప్రశ్నలు, వాటికి అనుబంధ ప్రశ్నలు సంధించారు.
విచారణ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారని, మంత్రుల సబ్కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసిందని హరీశ్రావును కమిషన్ ప్రశ్నించింది. రైతులకు ఎక్కువ నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్కమిటీ ఏర్పాటు చేసిందని, సబ్కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్తోపాటు తాను ఉన్నట్టు కమిషన్కు హరీశ్ వివరించారు.
మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, నీటి లభ్యత లేనందునే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినట్టు తెలిపారు. అన్నారం, సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్ని కల్ రిపోర్టుల ఆధారంగా జరిగాయని, వ్యా ప్కోస్ సంస్థ సర్వే చేయించిన తర్వాతే ప్రాజె క్టు స్థలం మారిందని వెల్లడించారు.
బరాజ్ల, ప్రాజెక్టుల లొకేషన్లు మారడం కొత్తేమీ కాదని, గతంలో నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల లొకేషన్లు మారాయని గుర్తుచేశారు. ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం అప్పటి ప్రభుత్వం హైపవర్ కమిటీకి ఇచ్చిందని పేర్కొన్నారు.
నీళ్లు అమ్మి లోన్ రీపేమెంట్..
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణమేంటని కమిషన్ ప్రశ్నించగా రుణాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు హ రీశ్రావు వివరించారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారన్న ప్రశ్నకు నీళ్లను అమ్మి రీపేమెంట్ చేయాలనుకున్నామని, కానీ కోవిడ్ కారణంగా రెండేళ్ల కుదరలేదని, అప్పటికే మెదక్లో కోకాకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయని చెప్పారు.
మే డిగడ్డ నుంచి మిడ్మానేరుకు డైరెక్ట్గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందన్నారు. బరాజ్ల్లో నీళ్లను స్టోరేజ్ చేశారా? అని ప్రశ్నించగా టెక్నికల్ అం శాలు తమ దృష్టిలో ఉండవని సమాధానమిచ్చారు. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశామని హరీశ్రావు చెప్పారు.
బరాజ్ల్లో ఎఫ్టీఎల్ వరకు నీళ్లు స్టోర్ చేశారా? నీళ్లు నిం పమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా అని కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ అం శాలు అధికారులు మాత్రమే చూసుకుంటారని, బరాజ్ల్లో నీళ్లు నింపమని ఎవ రూ ఆదేశించలేదన్నారు. 16లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పిందని, దాని సూచన మేరకే బరాజ్ లు, రిజర్వాయర్లు పెంచామని తెలిపారు.
పక్కా ఆధారాలు సమర్పించా..
కమిషన్ విచారణ అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.. కమిషన్ ముందు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. కమిషన్కు పక్కా ఆధారాలు సమర్పించానని, కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చానని తెలిపారు. విచారణలో భాగంగా తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు మేడిగడ్డకు మార్చారనే విషయంపై చాలాసేపు డిస్కషన్ జరిగిందన్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టేందుకు ప్రయత్నం చేశామని, కానీ ఆ తర్వాత రివ్యూలో అంతకు ముందున్న ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు. తల దగ్గర పనులు ప్రారంభించకుండా తోక వద్ద పనులు స్టార్ట్ చేశారని చెప్పారు.
ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో అక్కడ పనిచేయకుండా, కాలువలు, టన్నెల్స్ తవ్వారని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయన్నారు. 152మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టేందుకు ఏడేళ్ల నుంచి ఒప్పుకోవడం లేదని ఆనాడే మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ చెప్పారని గుర్తుచేశారు. ఆ విషయంలో పృథ్వీరాజ్చౌహాన్, అప్పటి ఏపీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని వెల్లండించారు.
వ్యాప్కోస్ సూచనతోనే ప్రత్యామ్నాయం..
మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంతో కూడా తాము తుమ్మిడిహట్టిపై చర్చలు జరిపామని, కేసీఆరే స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు సమక్షంలోనే సీఎం ఫడ్నవీస్కు చెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. దీనికితోడు తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవంటూ ప్రత్నామ్నా యం చూసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ మూడు లేఖలు రాసిందని, రిజర్వాయర్ల సంఖ్యను కూడా పెంచుకోవాలని సూచించిందని వివరించారు.
ఆ తర్వాత వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చిందన్నారు. సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ సూచనల మేరకు, ఇంజినీర్ల రికమెండేషన్ మేరకు బరాజ్ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందన్నారు.
కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్లైన్..
కాళేశ్వరాన్ని కొంతమంది కూలేశ్వరం అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని, కాళేశ్వరం అంటే 3 బరాజ్లు, 15 రిజర్వాయ ర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజ్లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావి టీ కెనాల్స్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కేపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగమే కాళేశ్వరం ప్రాజెక్టు సమాహారమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే గంధమల్లకు శంకుస్థాపన చేశారని, అక్కడికి నీళ్లు మల్లన్నసాగర్ నుంచి పోయేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. మరోవై పు హైదరాబాద్లో మూసీ సుందరీకరణకు 30 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని అంటున్నారని, అవి కూడా మల్లన్నసాగర్ నుంచి తెస్తున్నామని టెండర్లు పిలుస్తున్నారన్నారు.
అన్ని చేసుకుంటూ మళ్లీ కాళేశ్వ రం కూలిందంటూ కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టుగా వాగుతున్నారని మండిప డ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడిందన్నారు. ఎ ప్పటికైనా తెలంగాణకు లైఫ్లైన్ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టేనని కూడా ప్రజలకు స్పష్ట మైందన్నారు. సాక్ష్యాధారాలతో సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా లు డాక్యుమెంట్ రూపంలో కమిషన్కు అందజేశానని వెల్లడించారు.