30 June, 2026 | 3:52 PM

బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్ణ నిర్మాణం చేయండి

30-06-2026 03:17 PM

బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో కు అఖిలభారత ఐక్య రైతు సంబోధన్ షుగర్ ఫ్యాక్టరీని పూర్ణ నిర్మాణం చేయమని రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ పుట్టి నడిపి నాగన్న వినతి పత్రం అందజేశారు. అనంతం అనంతరం వారు మాట్లాడుతూ... బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పూర్ణ నిర్మాణం చేయుట గురించి లే ఆఫ్ ప్రకటించి 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్నికలో ఇచ్చిన మేము అధికారంలోకి రాగానే పూర్వ వైభవం తీసుకువస్తాం అన్నారు,  బోధన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది.

 ఈ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోని రెండో  ఫ్యాక్టరీ  అతిపెద్ద ఫ్యాక్టరీ అలనాడు ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీ బోధన్ రైతులు చెరుకు పండించి తీపి పంచి అలాంటి ఫ్యాక్టరీ రైతులకు చేదే మిగిలింది, ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పద్దని అనేక ఉద్యమాలు జరిగాయి, గతంలో ఉమ్మడిగా ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు గోకరాజు గంగరాజు వాళ్లకు 49 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం నిర్ణయించారు. ఈ పార్టీ అప్పుల్లో ఉన్నది మేం నడపలేము కార్మికులు కార్మికులకు తెలియకుండానే లే ఆఫ్ ప్రకటించి 11 సంవత్సరాలు అయింది.

పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వకుండా లే ఆఫ్ ప్రకటించడం కార్మికులకు రైతులకు మోసం చేయడమే పాలకులు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాంగనే 100 రోజుల్లోనే ఫ్యాక్టరీని నడుపుతామని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు భాగంగా మేము ఈ ఫ్యాక్టరీని సరైన బడ్జెట్ కేటాయించి పూర్వ వైభవం తీసుకు వస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటికీ  రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ  వెంటనే అమలు చేయాలని పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నాం .