calender_icon.png 2 June, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ భద్రత-మా బాధ్యత

31-05-2025 04:55:40 PM

- కార్డాన్ సెర్చ్ కు పూర్తిస్థాయిలో సహకరించండి 

- వాహనాల ధ్రువీకరణ పత్రాలు ఉండాల్సిందే 

- డీఎస్పీ వెంకటేశ్వర్లు..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మీ భద్రత మా బాధ్యతగా తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నామని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు(DSP Venkateshwarlu) భరోసా కల్పించారు. శనివారం మహబూబ్‌నగర్ రూరల్ పరిధిలో కేటీఆర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ...  దాదాపు 450 ఇళ్లను పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేని 23 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. క్రిమినల్ మూకలు, చోరీలకు పాల్పడే గుంపులపై నిరంతరంగా నిఘా కొనసాగుతోందని, ప్రజలు పోలీసులతో కలిసి సహకరించి భద్రతా వాతావరణం ఏర్పడేలా చేయాలన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగితే మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్, రూరల్, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య, రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్, హన్వాడ్, కోయిల్కొండ ఎస్‌ఐలు, పీఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.