calender_icon.png 2 June, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి

31-05-2025 04:51:59 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమాన్ని చట్ట ప్రకారంగా, పారదర్శకంగా, సానుకూలంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లతో భూ భారతి చట్టం ప్రకారంగా భూ సమస్యలు పరిష్కరించడానికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాలోని లింగంపేట్ మండలంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.

వచ్చే జూన్ 3 నుండి 20 వ తేదీ వరకు అన్ని మండలాల్లో భూభారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి సదస్సుల నిర్వహణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఒకరోజు ముందుగానే దరఖాస్తు ఫారాలను గ్రామాల్లో పంపిణీ చేయాలని తెలిపారు. సానుకూల పద్ధతిలో దరఖాస్తులను పరిశీలించాలని, క్షేత్ర పర్యటనలు చేయాలని అన్నారు.  బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టం పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కామారెడ్డి ఆర్డీఓ వీణ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.