22 June, 2026 | 2:34 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

విద్యాశాఖకు నిధులివ్వండి

06-07-2024 01:40 AM

రూ.20 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాదిలో రూ.16 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపగా.. 12 వేల కోట్ల వరకు కేటాయించారు. ప్రతి ఏడాది కేటాయిస్తున్న బడ్జెట్‌లో దాదాపు 80 శాతంపైగా నిధులు జీతాలకే ఖర్చు అవుతోంది. ఈక్రమంలో ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు నిధులను కేటాయించాలని ఈనెల 8న డిప్యూటీ సీఎంతో జరిగే ప్రీబడ్జెట్ సమావేశంలో ప్రతిపాదించనున్నారు.