18 August, 2026 | 1:22 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

విద్యాశాఖకు నిధులివ్వండి

06-07-2024 01:40 AM

రూ.20 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాదిలో రూ.16 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపగా.. 12 వేల కోట్ల వరకు కేటాయించారు. ప్రతి ఏడాది కేటాయిస్తున్న బడ్జెట్‌లో దాదాపు 80 శాతంపైగా నిధులు జీతాలకే ఖర్చు అవుతోంది. ఈక్రమంలో ఈసారి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు నిధులను కేటాయించాలని ఈనెల 8న డిప్యూటీ సీఎంతో జరిగే ప్రీబడ్జెట్ సమావేశంలో ప్రతిపాదించనున్నారు.