31-05-2025 07:13:14 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండల పరిధిలో జూన్ 3 నుండి 13వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ శిరీష(Tahsildar Sirisha) తెలిపారు. భూ సమస్యలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో భాగంగా ధరఖాస్తుల స్వీకరణకు రెండు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్ 3న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, ఇరవెండి, 4న ముసలిమడుగు, మోతె పట్టి నగర్, 5న కోయగూడెం, కృష్ణ సాగర్, 6న తాళ్ళగొమ్మూరు, నకిరిపేట, 9న సారపాక, ఉప్పసాక, 10న టేకుల చెరువు, సోంపల్లి, 11న లక్ష్మీపురం, మొరంపల్లి బంజర, 12న బూర్గంపాడు, అంజనాపురం, వేపలగడ్డ, 13న పినపాక పట్టి నగర్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా భూ సమస్యలు గల వారు తమ వద్దన గల ఆధారాలు, దస్తావేజులతో రెవెన్యూ సదస్సులో ధరఖాస్తులు చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు.