28-05-2025 07:13:53 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana State Formation Day) సందర్భముగా మహిళ ఉద్యోగులకు జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో బహుమతులు అందజేయడం జరుగుతుందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్ సేవాసమితి, కమ్యూనికేషన్ కో అర్దినేర్ లు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.