15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఘనంగా మహంకాళమ్మకు పోచమ్మ బోనాలు

28-05-2025 07:11 PM

కొండపాక: రేణుక ఎల్లమ్మ పునః ప్రతిష్టలో భాగంగా బుధవారం నాడు గ్రామ దేవతలకు గౌడ కులస్తులు బోనాలు చేశారు. కుకునూర్ పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులు కుల దైవం ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా బుధవారం ప్రజలు, మహిళలు మహంకాళమ్మకు పోచమ్మలకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు ఉదయం నుండి ఎల్లమ్మ దేవాలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, కంకణధారణ, దేవత విగ్రహల శ్రీమ ప్రదక్షణ, జలాదివాసము, ప్రదోష పూజ తదితర కార్యక్రమాలు చేపట్టారు.