09-04-2025 01:52:45 AM
కరీంనగర్, ఏప్రిల్8 (విజయక్రాంతి): చలో వరంగల్ పేరుతో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించ బోయే రజతోత్సవ సభ సన్నాహాకా సమావేశాన్ని మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గం లోని బిఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. వరంగల్ లో లక్షలాదిమందితో ఈనెల 27వ తారీఖున భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ అంటే ఎనలేని ప్రేమనీ...అదేవిధంగా కరీంనగర్ ప్రజలకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానం అన్నారు. తదనంతరం తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించారని తద్వారా.. తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
సమావేశం అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి పదివేల మందికి తగ్గకుండా బహిరంగ సభకు హాజరవుతామని ఎమ్మెల్యే గంగులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మెన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత- మహేష్,
కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు సాబీర్ భాష, దుర్షెడ్ ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ నరసయ్య, మరియు బిఆర్ఎస్ మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ ఆలీ, పాల్గొన్నారు.