09-04-2025 01:52:15 AM
మెప్మా, సెర్ఫ్లను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయం
ఇక అన్ని గ్రూపులు డీఆర్డీఏ పరిధిలోకి
ఖరారు కాని విధివిధానాలు
మెదక్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) :గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహి ళా సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఛ్), మున్సిపల్ ప్రాంతాల్లోని సం ఘాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ రెండు విభాగాలకు చెందిన సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకుని రావాలని తాజా గా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మెప్మాను సెర్ఫ్లో విలీనం చేయడంతో పాటు ఉద్యోగులను డీఆర్డీఏ పరిధిలోకి తీసుకురానున్నారు.
డీఆర్డీవో పర్యవేక్షణలో..
ప్రస్తుతం మెప్మా ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలలో మహిళా సంఘా లకు బ్యాంకు లింకేజీలు, స్త్రీనిధి రుణాలు ఇప్పించడంతో పాటు ఇందిరా మహిళాశక్తి అమలులో ఈ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. సెర్ఫ్లో విలీనమైతే వీరంతా ఇక నుం చి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది.
మెప్మా ఆర్పీలకే బాధ్యతలు...
మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఏ సర్వే చేపట్టినా మెప్మా ఆర్పీలకే ఆ బాధ్యతలు అప్పగించే వారు. ఓటర్ల జాబితా సవరణ, ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరకాస్తులపై విచారణ తదితర పనులకు మెప్మా ఆర్పీల సేవలను వినియోగించు కునే వారు. వీరిని సెర్ఫ్లో విలీనం చేస్తే ము న్సిపాలిటీల్లో ప్రభుత్వం నిర్వహిచే వివిధ రకాల సర్వేలకు ఇబ్బదులు కలితగే అవకా శం లేకపోలేదు. అయితే ఇప్పుడున్న టీఎంసీలు, సీఓలు, ఆర్పీలను డీఆర్డీఏ కిందకు తెస్తారా లేక మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలోనే ఉంచుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
విధివిధానాలు ఖరారు కాలేదు
సెర్ఫ్, మెప్మా విలీనానికి సం బంధించి ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. కానీ అడ్మిస్ట్రేషన్కు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావా ల్సి ఉంది. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తాం.