12-06-2025 12:10:29 AM
పొలంబాట పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): రోడ్లు సరిగ్గా లేని కారణంగా వర్షాకాలం తమతమ చేనులోకి పోవాలంటే పూర్తిగా బురదలో నెత్తిపై ఎరువు బస్తా పెట్టుకొని పోతేగాని చేను లోకి వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామంలో బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఎడ్ల బండి తొలుతూ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే చేనులో అరక దున్నుతు పొలం బాట పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత శాసన సభ సమావేశాల్లో రైతులు పడుతున్న కష్టాన్ని, ఇబ్బందులను ప్రభుత్వం దృష్జికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా తన చేను నుంచి మార్కెట్కు తరలించే పరిస్థితి రావాలన్నారు.
ఆ చేను వరకు రోడ్డు సౌకర్యం ఉంటేనే సాధ్యం కాదన్నారు. మార్కెట్లోని నాలుగు బస్తాలు వేసుకొని ఆ బస్తాలు నేరుగా రైతు పొలం దగ్గరికి వెళ్ళేటట్టు రోడ్డు సౌకర్యం ఉండాలన్నారు. వర్షాకాలంలో ఒక్కొక్కసారి బురదలో ఎడ్ల బండి దిగిపోవడంతో నడిచి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఆ రకమైన బాధ నుంచి విముక్తి కలగాలని పొలం బాటని కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రైతుల తరఫున దేశ ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి, కలెక్టర్ రాజర్షి షాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా రు.
ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ప్రస్తావించినందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ఎమ్మెల్యేగా సంతోషపడుతున్నాన న్నారు. పొలం బాటకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారన్నారు. గ్రామాలకు రోడ్లు ఎంత అవసరమో, అంతే పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.