12-06-2025 12:10:38 AM
నగదు పురస్కారం.. సర్టిఫికెట్ అందజేత
వైరా, జూన్ 11(విజయ క్రాంతి): శృంగేరి పీఠంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో వైరాకు చెందిన ధోనిపూడి సురేందర్ సతీమణి దోనేపూడి సునీత ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ క్లాస్ను కైవసం చేసుకుంది..భగవద్గీతలోని 730 శ్లోకాల్లో పోటీ నిర్వహించే నిర్వాహకులు వాటి లో అడిగిన ఏ శ్లోకాన్ని ఐనా అడిగిన వెంటనే చిత్తశుద్ధితో ఆలపించిన దోనేపూడి సునీతను శృంగేరి పీఠం పెద్దలు అభినందించారు.. ఉత్తమ ప్రతిభ గాను 31వేల రూపాయల నగదును సర్టిఫికెట్ను అందజేశారు.. భవద్గీతలో ఫస్ట్ క్లాస్ సాధించిన సునీతను వైరాకు చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు.