శీష్ మహల్పై పూర్తి నివేదిక ఇవ్వండి
విచారణకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౫: ఆప్ అధినేత కేజ్రీవాల్ చేపట్టి న శీష్ మహల్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం విచారణ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సె ంట్రల్ విజిలెన్స్ కమిషన్ శీష్ మహల్ నిర్మాణంపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని సె ంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను కోరింది.
దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ఫ్లాగ్స్టాఫ్ బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదిక అంది ంచాలని సీపీడబ్ల్యూడీని ఆదేశించింది.
బీజే పీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త సీఎం శీష్ మహల్లో ఉండరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పేర్కొన్నారు. ఇటీవలే ఢిల్లీ అసెం బ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్ మోసా ల్లో ‘శీష్ మహల్’లో జరిగిన అక్రమాలను బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకుంది.






