10-02-2026 02:15:37 AM
రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణను కాపాడాలన్నా, రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలంటే బీజేపీకి ఒక్క అవకాశమిచ్చి గెలిపించా లని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 30 శాతం కమీషన్ల పార్టీలుగా మారాయ ని ఆరోపించారు.
రాష్ర్టం లో అవినీతిరహిత పాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, పట్టణా లు, నగరాలు మెరుగుపడాలన్నా, మౌలిక సదుపాయాలు కావాలంటే బీజేపీని గెలిపిం చాలని కోరారు. బీజేపీ గెలిచాక చేపట్టబోయే అభివృద్ధి కార్యాచరణను స్పష్టంగా మ్యానిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తెచ్చామన్నారు.