నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వండి
15-10-2025 06:03 PM
డీసీసీ పీఠానికి దరఖాస్తు చేసుకున్న కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
దేవరకొండ (విజయక్రాంతి): కొండమల్లేపల్లి మండల కేంద్రనికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ప్రస్తుత కొండ మల్లేపల్లి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ బుధవారం దేవరకొండ నియోజక వర్గంలో మార్కెట్ యార్డులో డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ అభిప్రాయ సేకరణ ప్రక్రియలో వారు ఏఐసీసీ సెక్రటరీ, ఏఐసీసీ పరిశీలకులు బిశ్వాత్ రాజా మహతికు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు.




