17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మాకు రావాల్సిన జీతాలు ఇప్పించండి

13-05-2025 12:00 AM

మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి): ఏజెన్సీ పేరిట పని చేయించుకుని వేతనాలు చెల్లించకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 ఉద్యోగులు, కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్, స్వీపర్, పీఈటీ, ఇంగ్లీష్ టీచర్‌గా గత ఏడాది అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 సంస్థ ద్వారా విధులు నిర్వహిస్తున్న వారికి 8 నెలల గడిచినప్పటికీ సంస్థ నిర్వాహకులు మాత్రం వేతనాలు చెల్లించలేదన్నారు.

ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీటీడీవో, డీఈవో,  గిరిజన ఐటీడీఏ ఉట్నూర్ పిఓకు వేరువేరుగా వినతి పత్రాలు ఇచ్చామని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో శాతరాజు స్వాతి, గంట నరేష్, అనంత ఈ సొల్యూషన్ విద్యాంజలి 2.0 ఉద్యోగ, కార్మికులు, సీ ఐ టీ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, స్వరూప, సాయిరాణి, రాజేశ్వరి, ప్రశాంతి, రమ్య, సువర్ణ, ప్రణిత తదితరులు పాల్గొన్నారు.