01-10-2025 12:05:34 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, సెప్టెంబర్ 30: అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం శ్రీ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ , కట్టంగూర్ మండలంలోని నోముల,చెర్వు అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల వెంకటరెడ్డి, ఎడ్ల పెద్ద రాములు, చెవుగోని రవి, నర్సిరెడ్డి, యాస కరుణకర్.తదిరులు పాల్గొన్నారు.