calender_icon.png 14 June, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామకృష్ణులకు జయరామ జయజయరామ!

08-01-2025 12:00:00 AM

నీళాదేవి ద్వారం వరకు వచ్చి మం గళా శాసనం చేసి, సింహాననం మీ ద కూర్చున్నారు. ఒక పాదం పాదపీఠిపైనుం చి మరొకటి తొడమీద పెట్టుకున్నప్పుడు స్వా మి పాదం ఎర్రగా కందినట్టు కనిపించిందట. అయ్యో స్వామిని ఎంత శ్రమ పెట్టాము? భక్తులకోసం ఆయన తన శ్రమను లెక్క చేయడట.

ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు చెప్ప గానే ఉభయ సైన్యాలమధ్య రథాన్ని నిలిపిన సారథివలె భక్తుల ఆజ్ఞ శిరసావహించి భగవంతుడు శ్రమ పడుతున్నాడు. నిజానికి వ్ర తఫలం అడుగుదామని గోపికలు వచ్చారు.  వచ్చిన పని మరిచి గోపికలు, గోదాదేవి పరమాత్ముడి పాదాలకు రక్ష కట్టి మంగళం పా డుతున్నారు ఈ పాశురంలో. జగద్రక్షకుడిని తాము రక్షకట్టి కాపాడుకోవాలని అనుకుంటున్నారు. ఇది ప్రేమ తప్ప మరొకటి కాదు.

పెళ్లికొడుక్కు, వధువుకు, వటుడికి, పుట్టినరోజు జరుపుకున్న పిల్లలకు, కొత్త దుస్తులు వే సుకున్న వారికి అమ్మమ్మ దిష్టి తీయడం మ నకు తెలుసు. భగవంతుడి అర్చామూర్తికి ఉ త్సవాలలోనూ మూలవిరాట్టుకు మంగళాశాసనాలుంటాయి. ఆడపడచులు ముత్తయి దువలు పాడుతూ హారతులిస్తారు. అందులోనూ హరికీర్తనే. ద్వయమంత్రానుసంధాన మే అంటే ‘శ్రీమన్నారాయణ చరణం శరణౌ ప్రపద్యే, శ్రీమతేనారాయణాయ నమః’ అవే రెండుసార్లు నారాయణ మంత్రం జపించడమే.

భగవంతుడై అద్భుత కార్యాలను సా ధించి మోహనరూపుడూ మనోహరుడూ అ యినప్పుడు ఆచార్యులు, అర్చకులు, ఆళ్వారులు మంగళ శాసనాల ద్వారా సంస్కృత, తమిళ, తెలుగు లేదా మామూలు మాటల ద్వారా హారతులిస్తారు. ఆళ్వారులు మంగళం పాడిన సన్నిధానాలను దివ్యదేశాలని పిలుస్తారు. భారత్, నేపాల్‌లో కలిసి ఇటువంటి శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాలు 108 ఉన్నాయి.

గోదాదేవి గోపికలతో కలిసి తిరుప్పావులో మంగళం పాడే బాధ్యతను స్వీకరించిన ఆళ్వారులలోకి వస్తారు. యశోద, దేవకీదేవి, కౌసల్య, అదితి తదితర తల్లుల బాధ్యతను గో దాదేవి స్వీకరించారు. ఆర్తితో భక్తితో పరమాత్ముడి పాదాలకు పదపదాన మంగళ కరమై న పదాలతో మంగళం పాడుతున్నారు గోదాదేవి ఈ పాశురంలో.

తమ కోరికపైన శయ నాగారం నుంచి సభా భవనంలోకి నడిచి వచ్చిన శ్రీకృష్ణుడి పాదాలకు శ్రమ ఇచ్చామే అని గోపికలు నొచ్చుకున్నారు.  పరమాత్ము డు భక్తులకోసం కష్టాలు పడిన సందర్బాలలో ఎవరూ మంగళం పా డ లేదని, దృష్టి తీయలేదని గోపికలు అనుకుంటున్నారు. ఆ లోపం తీర్చాలని భావిస్తున్నారు.

లక్ష్మీదేవి సుతిమెత్తగా పాదాలు ఒత్తినందు కే కందిన శ్రీహరి పాదాలు ఆనాడు వామనుడై ఆకాశ, పృథ్వీ లోకాలను రెండడుగుల తో కొల్చినపుడు ఎత్తుపల్లాలు తాకి ఎంత కం దిపోయాయో, క్రూరులైన రాక్షసులు, మృ గాలతో నిండిన అడవులలో నడిచిన రామా! నీ పాదాలు ఎన్ని బాధలు పడ్డాయో. పుట్టిన ఏడో రోజునే శకటాసురుడిని తన్నినప్పుడు క్రి ష్ణయ్య పాదాలు ఎంత నొచ్చుకున్నాయో.

వృత్రాసురుని రెండు చేతులతో ఎత్తి వెలగపండు రూపంలో చెట్టుకు వేలాడుతున్న మ రో రాక్షసుడిపైకి విసరడానికి నేలపైన కాళ్లు గట్టిగా నిలబెట్టినపుడు కన్నయ్యకెంత శ్రమ కలిగిందో, వారం రోజులపాటు గోవర్ధన ప ర్వతం ఎత్తిన ఆ బాలగోపాలుని వేలు ఎంత గా వత్తిడికి గురైందో, అప్పుడు ఆ నారాయణుడి దివ్య పాదారవిందాలకు మంగళం ఎవ రు పాడారు? మేమంతా ఈరోజు నీకిదే మం గళం పాడుతున్నాం.

తనను ఎవరూ ఏమీ చేయలేరనే దురహంకారంతో సీతను ఎత్తుకుపోతే, అక్కడకి చేరి రావణుడి స్థానబలిమికి భయపడకుండా పరాక్రమించి అతడిని సంహరించడం ఎంత సాహస కార్యం? అంత పనిచేసిన శ్రీరాముడికి మంగళం పాడుతున్నారు. శత్రువులను జయించే నీ వేలాయుధానికి మంగళం అన్నారు గోపికలు. నిజానికి వారికి కావలసింది కేవలం శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించడమే. ఊళ్లో వారికోసం పైకి వారు పఱై అనే వాయిద్య పరికరం ఢక్కాను అడుగుతున్నారు.