08-01-2025 12:00:00 AM
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా గత కొంత కాలంగా ఊహిస్తూ వచ్చిందే. అయితే ప్రధాని పదవితో పాటుగా అధికార లిబరల్ పార్టీ నాయకత్వ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ కొత్త నాయకుడ్ని ఎన్నుకునే దాకా పదవిలో కొనసాగుతానని ప్రకటించడంతోపాటు అప్పటిదాకా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్రూడో రాజీనామా తర్వాత లిబరల్ పార్టీ నాయకత్వం రెండు ప్రధాన ఎంపికలు చేయాల్సి ఉంటుంది. మొదటగా ప్రధాన పదవికి తాత్కాలిక నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. కెనడాలో ఈ ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే నేతనూ ఎంపిక చేయాలి. కెనడా చట్ట ప్రకారం అధికార పార్టీ నేత రాజీనామా చేసిన పక్షంలో 90 రోజుల్లో కొత్త నేతను ఎన్ను కోవాలి.
అయితే ఎన్నికలు ముంచుకొస్తున్నందున ఈ ప్రక్రియకు బుధవారం జరిగే పార్టీ సమావేశంలో ముగింపు పలికే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. క్రిస్టియా ఫ్రీలాండ్, డొమెనిక్ లెబ్లాంక్, మార్క్ కార్నీలలో ఒక రు ట్రూడో వారసులుగా ఎంపిక అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా రు. క్రిస్టియా, లెబ్లాంక్ ఇద్దరూ ట్రూడో కేబినెట్లో మంత్రులుగా పని చేసి న వారు కాగా, మార్క్ కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలు నిర్వహించారు.
దాదాపు పదేళ్ల పాటు కెన డా ప్రధానిగా కొనసాగిన ట్రూడో గత కొంత కాలంగా సొంత పార్టీ నేతలనుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయన వైదొలగాలంటూ ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజంట్ల పాత్ర ఉందని ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆ యన చేసిన ఆరోపణలతో భారత్, కెనడా మధ్య దౌత్యసంబంధాలు తీ వ్రంగా దెబ్బతిన్నాయి.
ట్రూడో వైఖరి కెనడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే భారతీయ సంతతి వారికి సైతం ఆగ్రహం తెప్పించింది. ఖలిస్థానీ వాదులకు మద్దతుగా నిలస్తూ ఇతర హిందువులపై వారి దాడులను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంతో ఆ వర్గాలన్నీ ఆయనకు వ్యతి రేకంగా మారాయి. ఒకప్పుడు దేశంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ట్రూడో పాపులారిటీ ఇటీవలి కాలంలో బాగా పడిపోయింది. మరో వైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. ట్రూడో పాలనపై ఇటీవల బహిరంగ విమర్శలు చేశారు. ఇవన్నీ రాజీనామాకు కారణమయ్యాయి.
ఇప్పుడు ట్రూడో వైదొలగడంతో భారత్ కెనడా సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ట్రూడో హయాంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు గణనీయంగా వృద్ధి చెందాయి. 2024 చివరి నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 8.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే భారత్నుంచి పైచదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే వారి సంఖ్య సైతం గత కొన్నేళ్లుగా భారీగా పెరిగింది.
అయితే స్టడీ వీసా ప్రోగ్రాంలో భారీగా కోత విధించడంతో పాటుగా అంతర్జాతీయ స్టూడెంట్ పర్మిట్లకు 35 శాతం మేర కోత పెడుతూ ట్రూడో ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థి వర్గంపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఎందుకంటే కెనడాలో 4 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. ఒక వేళ లిబరల్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన పక్షంలో కొత్త ప్రభుత్వం వీటన్నిటినీ సత్వరం చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కన్సర్వేటివ్ పార్టీ గెలుపొందితే అంతర్జాతీయంగా ముఖ్యంగా భారత్ పట్ల ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.