calender_icon.png 2 June, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి

31-05-2025 10:41:03 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): రైతులు సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డా. రవి, సిఆర్ఐడిఏ శాస్త్రవేత్త డా, శరత్ చంద్రన్, ఎన్ఏఏఆర్ఎం శాస్త్రవేత్త డా. పిసి మీనాలు అన్నారు. శనివారం రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులకు వానాకాలం సమాయత్తం, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిల్లు ప్రాముఖ్యత తదితర అంశాలను వివరించడం జరిగిందన్నారు.

అదేవిధంగా అవసరం మేరకు రసాయనాలు వినియోగం వల్ల నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొన్నప్పుడు వాటికి సంబంధించిన రసీదులను భద్రపరచుకోవాలన్నారు. ఇలా ఉండగా మండలంలోని ఫర్టిలైజర్ దుకాణం దారులు ఇష్టానుసారంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారని అమ్మిన వాటికి బిల్లులు ఇవ్వడం లేదని ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్టాక్ ఉన్న ఎరువులు, విత్తనాలు అవుతున్నారని మండిపడ్డారు. మండలానికి శాస్త్రవేత్తల బృందం వస్తే రైతులకు సరైన సమాచారం అందించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.