calender_icon.png 7 June, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేయాలి

05-06-2025 10:44:56 PM

కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎంఎస్ ధర్నా...

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం పేద రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందించాలని, నకిలీ విత్తనాలు మార్కెట్లో విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని బయ్యారం గార్ల మండలాలకు గోదావరి నది ద్వారా సీతారామ ప్రాజెక్టు నుండి తాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ సత్యనారాయణ మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఖరీఫ్ సాగు పది రోజుల ముందుగానే చేపట్టారని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అమ్మకాల్లో నకిలీ బెడదను అరికట్టాలని డిమాండ్ చేశారు. సాగు పెట్టుబడి అందజేయాలని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని, పోడు భూములకు భూభారతి చట్టం ద్వారా పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గుజ్జు దేవేందర్, నందగిరి వెంకటేశ్వర్లు, బండారు ఐలయ్య, మోకాళ్ళ మురళీకృష్ణ, బాబన్న, బట్టు నాగేశ్వరరావు, గుగులోతు సకృ, మైనం యాదయ్య, సోమిరెడ్డి, చింత వెంకన్న, లక్ష్మయ్య, వెంకటనారాయణ, భగవాన్, గౌరీ తదితరులు పాల్గొన్నారు.