20-02-2026 01:41:00 AM
గూగుల్ మున్ముందు భారత్లో 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టబోతున్నదని సంస్థ సీఈవో సుందర్పిచాయ్ స్పష్టం చేశారు. తమ సంస్థ ‘అమెరికా-- ఇండియా కనెక్ట్’ పే రుతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపడుతున్నదని వివరించారు. సముద్రగర్భంలో ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసి భారత్ను అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో అనుసంధానిస్తామని తెలిపారు.