07-11-2025 05:17:02 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారిగా గోపికృష్ణ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ వన్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా డీటీఓగా నియామకం అయ్యారు. డీటీఓ కిష్టయ్య 2024, ఫిబ్రవరి 19న బదిలీపై వెళ్లిన అనంతరం ఇంఛార్జీ డీటీఓగా సంతోష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 20 నెలల అనంతరం రెగ్యూలర్ డీటీఓగా గోపికృష్ణ విధుల్లో చేరారు. ఎంవీఐలు తుల్సిరాం సంతోష్ కుమార్, కిశోర్ చంద్రా రెడ్డి, రంజిత్ లతో పాటు ఏఎంవీఐలు ఖాసీం, సాయి లెనిన్, సూర్యతేజలు డీటీఓ గోపికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.