calender_icon.png 1 June, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యంతోనే వరి ధాన్య రైతులకు నష్టాలు

30-05-2025 07:15:14 PM

సారంగాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం అధికారుల అలసత్వం అసమర్థత వల్లనే వరి ధాన్యం రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కె రామ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను టిఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తామని చెప్తున్న స్థానిక కొనుగోలలో తడిసిన ధాన్యం పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తేమ నిబంధన శాతాన్ని ఎత్తివేయాలని పెట్టుబడి సాయం ఈ ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల నాయకులు పాల్గొన్నారు.